ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వైద్య వర్గాలు తెలిపాయి. గుండెపోటుకు గురైన అనంతరం తొలుత హనుమకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు అత్యవసర చికిత్స నిరంతరం పర్యవేక్షించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా సహకరించారు. * ప్రభుత్వ లాంఛనాలతో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు* పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వాలతో ఆయన గ్రామం నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. అంతిమయాత్రలో టిఆర్ఎస్ అధినేతలు కేటీఆర్ తో సహా గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.
Admin
E Nivas News