ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలజిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం, దండేపల్లిమండలంలోని మేదరిపేట గ్రామపంచాయతీ కార్యాలయం లలో ఏర్పాటు చేసిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం హెల్ప్ డెస్క్ లను సందర్శించి బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజ్ ప్రక్రియ వేగవంతం చేసి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం మండలాల తహసిల్దార్ కార్యాలయాలను బి సెక్షన్ సూపరింటెండెంట్ తో కలిసి సందర్శించి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, భూ సేకరణ సంబంధిత అంశాలపై కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగాభూసమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్ ఇతర సేవలను, భూ సంబంధిత సర్వీసులను నిబంధనల ప్రకారం వేగవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కరణ వేగవంతం చేయాలని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతోస్నేహపూర్వకంగా మెలగాలని, సర్టిఫికెట్లను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసిల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News