Wednesday, 17 June 2026 01:48:23 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

రంజాన్ తోఫా పంపణీ

Date : 14 March 2026 07:11 AM Views : 145

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రంజాన్ పండుగను పురస్కరించుకొని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ముస్లీమ్ లకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పట్టణంలోని విశ్రాంతిభవనం లో రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముస్లీం కుటుంబాలకు ప్రతి ఏటా రంజాన్ తోఫాను అందిస్తున్నామన్నారు. ప్రతి ముస్లీమ్ కుటుంబం పండుగ వేళ ఆనందంతో ఉండేలా అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా తోఫా పంపిణీని ఆపలేదని గుర్తు చేశారు. లక్షేట్టిపేటలో మొత్తం 823 మందికి చీరలు, 5 కిలోల బియ్యం, డ్రై ఫ్రూట్స్ తో కూడిన కిట్ ను అందిస్తునట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. సమాజంలోని అన్ని మతాలను సమానంగా ఆదరించేది కాంగ్రెస్ అని వివరించారు. రాబోయే రోజుల్లో లక్షేట్టిపేటను అన్ని విధాలుగా అభివృద్ధిచేస్తామన్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిరంతరం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పని చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేనాయకత్వంలో లక్షేట్టిపేటలో ఇంకా చాలా అభివృద్ధి పనులు జరుగుతాయని, ప్రజలు ఎమ్మెల్యేకు అండగా ఉండాలని కోరారు.అభివృద్ధి లో మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. అనంతరం పలువురు ముస్లీమ్ లకు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ చేతుల మీదుగా రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఆరీఫ్,రమేష్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు శనిగారపు చిన్నయ్య,తోట సువర్ణ,రాజేంద్ర ప్రసాద్, పెండెం పద్మ రాజు,సూరం చంద్రమౌళి, పర్వీన్ సుల్తానా, బిరుదుల సత్యనారాయణ, గోప సుజాత రమేష్, నాయకులు నాగభూషణం, చింత అశోక్, ముక్రమ్ జా, సర్పంచ్ నల్లపు రజిత పోషమల్లు, సందెల సురేష్, నలిమేల రాజు, దుమ్మని సత్యన్న, శాతరాసి బానేష్, కార్యకర్తలుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :