ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అభివృద్ధి చేసేందుకు శాయ శక్తుల కృషి చేస్తానని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. కళాశాలలో జరిగిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే నిధులు కేటాయించారని, మంత్రి సహాయ సహకారాలతో కళాశాలను మరింతగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇంత అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్న ఈ కళాశాల విద్యార్థిని ప్రభుత్వ కళాశాలలో జిల్లాలో మొదటి స్థానం సాధించడం అభినందనీయమన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలలో చదివే బదులు అదే స్థాయిలో విద్యనందిస్తున్న ప్రభుత్వ సంస్థను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అత్యుత్తమ పలితాలు సాధించిన విద్యార్థినిలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలోజీ, అధ్యాపకులు రావుల తిరుమల్, శశాంక్ , శ్రీదేవి, నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి, సబిత, మౌనిక, సిబ్బంది బియ్యబాని, అనసూయ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News