ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / కురవి : మొoథా తుఫాన్ బీభత్సం వలన పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం సర్వే నిర్వహించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి కోరారు. కురవి మండల పరిధిలో మొoథా తుఫాన్ వలన నష్టపోయిన పత్తి, వరి పంటలను సిపిఐ బృందం పరిశీలించి, రైతాంగాన్ని ఓదార్చింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పత్తి రంగు మారిపోయి రైతాంగo తీవ్రంగా నష్టపోయారని, వరి చేతికొచ్చే దశలో తుఫాను తాకిడితో పంట కింద పడిపోయి రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వెంటనే అధికార యంత్రాంగం సమగ్ర సర్వే నిర్వహించి పంట నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, కొరివి పట్టణ కార్యదర్శి తురక రమేష్, బుర్ర సమ్మయ్య, కలగూర నాగరాజు, అప్పాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News