ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చి రోడ్డులోనివాసం ఉండే మద్దెల వివేక్ 24 సంవత్సరాల యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. మృతుడు డిగ్రీ విద్య మధ్యలో ఆపి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తన ఇద్దరు చెల్లెలు మంచిగా చదువుకొని ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండగా తాను మాత్రం చదువు మధ్యలో ఆపి ఖాళీగా ఉంటున్నానని మనస్థాపం చెంది ఈనెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంట కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా స్థానికులు కుటుంబ సభ్యులు లక్షట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు మృతుని తండ్రి కమలాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Admin
E Nivas News