ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో శుక్రవారం మున్సిపాలిటీ మరియు మండల నాయకులు, కార్యకర్తలు కలిసి పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ పార్టీకి ప్రజల విశ్వాసం మళ్లీ తెచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగించే నాయకుడు నవీన్ యాదవ్ అని కొనియాడారు. పార్టీ బలపరచడంలో ప్రతి కార్యకర్త శ్రద్ధగా పనిచేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండే రాజకీయాలు కొనసాగించాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ విజయాన్ని పార్టీ శ్రేణుల ఐక్యతకు గుర్తుగా తెలిపారు. సమైక్యంగా ముందుకు సాగి ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం జిల్లా ఆర్టీయె మెంబెర్ అంకతి శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా అధ్యక్షులు చింత అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలా రాజు,కంది మోహన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రావు, అమీర్,పెట్టాం మల్లికార్జున్ ముత్తే సుధాకర్, గుండ శ్రీనివాస్, బైరమ్ వెంకటేష్, రాజు,తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News