ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు 2026 నుండి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రైవేట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అనుమతులు ఇవ్వకూడదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న వాటిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. ఒక ప్రైవేటు విద్యాసంస్థ అనుమతులు తీసుకుని అనేక ప్రైవేటు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటు రన్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతి ఇవ్వద్దని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. త్వరలో హైకోర్టులో స్టే అడుగుతామని రాష్ట్రంలో పర్మిషన్ లేని కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలపై ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి అనుమతులు లేని ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులపై కఠినంగా చర్యలు తీసుకొని విద్యశాఖ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యా సమస్యలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వద్దని హైకోర్టులో స్టేకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాముని అన్నారు.
Admin
E Nivas News