ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని,నాణ్యత ప్రమాణాలనుఖచ్చితంగా పాటించాలని తెలిపారు.విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్మాణ పనులు నిర్వహించాలని, నిర్మాణ సామగ్రి నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకుఅందిస్తున్న వసతులు,విద్యా సదుపాయాలు,భోజనం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం,పరిశుభ్రత పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు,అకడమిక్ రికార్డులు,ఇతర పరిపాలన రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం,క్రమశిక్షణ, నాణ్యమైన బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.వంటగది, స్టోర్ రూమ్,తరగతి గదులు,వసతి గదులు, ఇతర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థినుల సంక్షేమం ,భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు ,గుత్తేదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News