ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో కలకలం రేపిన దొంగ నోట్ల చెలామణి దందా ముఠా వివరాలను శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెట్రోల్ బంక్ లో బుధవారం స్విఫ్ట్ కార్ లో వచ్చిన కానుగంటి క్రాంతికుమార్ అనే వ్యక్తి రూ. 1500 ల పెట్రోల్ పోయించుకుని వెళ్లగా, అవి దొంగ నోట్లని గుర్తించిన బంక్ సిబ్బంది పెట్రోల్ బంక్ ఓనర్ కు తెలుపగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దొంగ నోట్ల చెలామణిలో ఏ1గా ఉన్నటువంటి కానుగంటి క్రాంతి కుమార్,రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇటిక్యాలనివాసి. ఇతను ఏ 2 గడికొప్పుల రవీందర్ ఆటో డ్రైవర్, లక్షేట్టిపేట ఏ 3 తాండ్ర ప్రకాష్, ఆర్కె 6 శ్రీరాంపూర్, ఏ 4 కొంక మధుకర్, వెంకట్రావ్ పేట్, ఏ 5 సుంకే సురేష్, గోదావరిఖని, ఏ 6 కామిని అనిల్, పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ నుంచి దొంగ నోట్లు తెచ్చి చెలామణి చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. కాకినాడకు చెందిన రాము, రవిల నుంచి నకిలీ కరెన్సీ రూ. 5,98,500తెచ్చి చెలామణి చేయడానికి ప్రయత్నించే క్రమంలో స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఏ7 రాం నాయక్, బెంగులూరు బేకరీ, లక్షేట్టిపేట,ఏ8 నాగునూరి రాము, మోదేలా, లక్షేట్టిపేట, ఏ9 దేవబోయిన సంపత్, బెజ్జంకి, సిద్దిపేట జిల్లా,ఏ10 కడమండ్ల తిరుపతి, జెండా వెంకటాపూర్, ఏ11 గోళ్ళ కుమారస్వామి, పెర్కపల్లి, పెద్దపల్లి జిల్లా,ఏ12 బండారి సత్యనారాయణ,రంగపేట, లక్షేట్టిపేటకు చెందిన వారని ఏసీపీ తెలిపారు. కాగా ఏ 13 రాము, ఏ 14 రవి లు ఇద్దరూ పరారీ లో ఉన్నారని వివరించారు. కాకినాడ నుంచి జరుగుతున్న నోట్ల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి విచారణ చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. నకిలీ కరెన్సీ రూ. 5,98,500లతో పాటు నిందితులు వాడిన 3 కార్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజలు ఈ దొంగ నోట్ల చెలామణి జరుగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కోరారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ రమణ మూర్తి, ఎస్సై లు గోపతి సురేష్, తాజుద్దీన్ సిబ్బందిని ఏసీపీ ప్రకాష్ అభినందించారు.
Admin
E Nivas News