ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2025 కు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు టీజీపీ ఈ జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా విద్యుత్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.ఈ నిరసన లొ భాగంగా జేయేసి నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని, ప్రైవేటీకరణ తొ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు తీవ్రమయిన నష్టం తీరని అన్యాయం జరగడమే కాకుండ నిరుద్యోగులకి ప్రభుత్వ కొలువులు రావని చెప్పారు, అలాగే రైతులకి, సామాన్య ప్రజలకి, చిన్న- మధ్య తరగతి పరిశ్రమలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని సబ్సిడీలను క్రమ క్రమంగా ఎత్తి వేయాల్సి వస్తుందని, విద్యుత్ చార్జీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో పెరుగుతాయని అలాగే ప్రజల సొమ్ముతో కార్మికుల చెమటని చిందించి దశాబ్దాలుగా నిర్మించుకున్న వందలకోట్ల విలువైన లైన్స్ ని ప్రైవేట్ కంపెనీలకు నామ మాత్రపు చార్జీలకే ధారాదత్తం చేయవలసి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా స్టేట్ ఈ ఆర్ సి సభ్యులని తీసివేసే అధికారం పొందనుందని, దీనివలన రాష్ట్రాల హక్కులకు భంగం ఏర్పడుతుంది చెప్పారు. ఈ బిల్లు ద్వార ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలనుంచి విద్యుత్ ని అధిక ఛార్జీలకు కొనే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సవరణ బిల్ ని రద్దు చేసెంతవరకు వరకు మా నిరసనలు ఆగవని ఇంకా ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఎస్ ఈ. సుదర్శనం మరియు జేయేసి నాయకులు చేరాలు, అజీజ్ , రాంజీ నాయక్, , సతీష్, అశోక్ రెడ్డి, భూమయ్య, అభీద్, గార్లు, మరియు పలు సంఘాల నాయకులు, విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News