Friday, 19 June 2026 01:57:59 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

జగిత్యాల లో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Date : 10 March 2026 10:18 PM Views : 136

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2025 కు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు టీజీపీ ఈ జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా విద్యుత్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.ఈ నిరసన లొ భాగంగా జేయేసి నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని, ప్రైవేటీకరణ తొ ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు తీవ్రమయిన నష్టం తీరని అన్యాయం జరగడమే కాకుండ నిరుద్యోగులకి ప్రభుత్వ కొలువులు రావని చెప్పారు, అలాగే రైతులకి, సామాన్య ప్రజలకి, చిన్న- మధ్య తరగతి పరిశ్రమలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని సబ్సిడీలను క్రమ క్రమంగా ఎత్తి వేయాల్సి వస్తుందని, విద్యుత్ చార్జీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో పెరుగుతాయని అలాగే ప్రజల సొమ్ముతో కార్మికుల చెమటని చిందించి దశాబ్దాలుగా నిర్మించుకున్న వందలకోట్ల విలువైన లైన్స్ ని ప్రైవేట్ కంపెనీలకు నామ మాత్రపు చార్జీలకే ధారాదత్తం చేయవలసి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా స్టేట్ ఈ ఆర్ సి సభ్యులని తీసివేసే అధికారం పొందనుందని, దీనివలన రాష్ట్రాల హక్కులకు భంగం ఏర్పడుతుంది చెప్పారు. ఈ బిల్లు ద్వార ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలనుంచి విద్యుత్ ని అధిక ఛార్జీలకు కొనే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సవరణ బిల్ ని రద్దు చేసెంతవరకు వరకు మా నిరసనలు ఆగవని ఇంకా ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఎస్ ఈ. సుదర్శనం మరియు జేయేసి నాయకులు చేరాలు, అజీజ్ , రాంజీ నాయక్, , సతీష్, అశోక్ రెడ్డి, భూమయ్య, అభీద్, గార్లు, మరియు పలు సంఘాల నాయకులు, విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: