Wednesday, 17 June 2026 01:41:55 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన..

స్కూల్ విద్యార్థులచే "ఖాకీ కిడ్స్" పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 22 February 2026 02:33 PM Views : 114

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా "ఖాకీ కిడ్స్" పేరుతో నూతన కార్యక్రమాన్ని శనివారంఉదయం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ ఆవరణ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్ర డిజిపి. బి. శివధర్ రెడ్డి చే ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" లో భాగంగా,ఈకార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు "ఖాకీ కిడ్స్" గా మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కానిస్టేబుల్ ని ఎంపిక చేసి ఈ కానిస్టేబుల్ ప్రతి వారంలో మూడు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఫై మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి వారిని "ఖాకీ కిడ్స్" గా మార్చనున్నారు. అవగాహన పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా పోలీసు శాఖ తరపున ఒక బ్యాడ్జిను అందజేయడం జరుగుతుందన్నారు. వీరు తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను చుట్టుపక్కల వాళ్ళని వారికి తెలిసిన ప్రతి ఒక్కరిని హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని, రోడ్డుపై ట్రిబల్ రైడింగ్, కార్ల నందు సీట్ బెల్ట్, రాజ్ డ్రైవింగ్ జరగకుండా ప్రోత్సహించి ప్రమాదాలను అరికట్టేలా తమ వంతు పాత్ర పోషించాలని పోలీసు వ్యవస్థకు సహకరించి ప్రాణనష్టాన్ని తగ్గించాలని తెలిపారు. అదేవిధంగా దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడానికి అవగాహన మాత్రమే ఉపయోగపడుతుందని, అవగాహన కల్పించి చైతన్య పరచడంతో సైబర్ నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. వీరందరికీ ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న నూతన సైబర్ క్రైమ్ పద్ధతులను సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న తీరులను వివరించి చైతన్యపరచాలని తెలిపారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆర్థిక నేరాలలో గోల్డెన్ హవర్ ప్రాముఖ్యతను తెలియజేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు ఇంటర్నెట్ వాడటం ద్వారా వాటిచే జరిగే దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి పరిపాలన పి. మౌనిక ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కె స్వామి, ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రిసర్వ్ ఇన్స్పెక్టర్లు టి మురళి, ఎన్ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: