ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ప్రభుత్వ బడులను కాపాడుకొని వాటిని బలోపేతం చేయాలని మరిపెడ మండలo గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ నా రెడ్డి కవిత అన్నారు. మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో 35 మంది స్కూలు పిల్లలకు సుమారు 12 వేల విలువగల బుక్స్,యూనిఫామ్ లను పిల్లలకు అందించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులందరూ పేద పిల్లలు కావడంతో వారికి సరైన యూనిఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ కవిత తెలిపారు. వైట్ యూనిఫామ్, వైట్ షూస్, సాక్స్ లను స్పాన్సర్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నారెడ్డి శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ బల్లెం ఎల్లయ్య, వార్డ్ సభ్యులు ఏడెల్లి వెంకన్న, గ్రామ పెద్దలు చలమళ్ళ వెంకన్న,శవగాని ఉపేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంపల్లి వెంకన్న, స్కూల్ టీచర్స్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News