ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి లోక్సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భక్తితో మెట్ల మార్గం ద్వారా కొండలెక్కుతున్న సమయంలో అక్కడ ఏర్పడిన పరిస్థితులు తన మనసును తీవ్రంగా కలచివేశాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏడుకొండల మెట్ల మార్గం అత్యంత నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.మెట్ల దారి పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు, కన్స్ట్రక్షన్ వేస్ట్ పేరుకుపోయి ఉండటం వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు. టాయిలెట్ ఇన్నోవేషన్ల పేరుతో ఏర్పాటు చేసిన కమోడ్లు, మెట్ల మధ్యలో పెట్టిన స్టీల్ ట్రేల కారణంగా భక్తులు సరిగా నడవలేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని, కాళ్లకు గాయాలయ్యే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండాకనీసం ఫస్ట్ఎయిడ్ కేంద్రాలు కూడా మెట్ల మార్గంలో అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మెట్టు వద్ద భక్తులు బస్సులు, కార్ల మధ్య నుంచి ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సి వస్తోందని, ఇది భక్తుల భద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి, తిరుమల మెట్ల మార్గంలో తక్షణమే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.భక్తుల భద్రత, శుభ్రత, గౌరవంతో దర్శనం జరగడం అత్యంత ప్రాధాన్యమని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగడం అనర్హమని ఆయన స్పష్టం చేశారు.
Admin
E Nivas News