Wednesday, 08 April 2026 03:10:13 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు...

దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కూలిన చలువ పందిళ్ళు..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు..

Date : 01 April 2026 11:04 PM Views : 96

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఇష్టదైవమైన ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పుణ్యక్షేత్రానికి హనుమాన్ జయంతి గురువారం జరగనున్న నేపథ్యంలో దీక్షలో ఉన్న లక్షలాది మంది భక్తులు గత ఐదు రోజుల నుండి కాలినడకన పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీక్ష విరమించడానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన చలవ పందులు ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు ఆగ్రహావేశాలకు గురై అధికారులను నిలదీశారు. వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన భక్తులు కాస్త సేద తీరిన తర్వాత వారి మాల విరమణ చేసి స్వామి వారిని దర్శించుకొని వారి మొక్కులు అప్పజెప్తారు. అలాంటి వారికి దేవదాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వారి యొక్క పనులను చేయడంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయ అధికారులను ఎండ కడుతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని మొత్తం సిబ్బందితో పాటు పూజారులే మింగేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చిన భక్తులకు సరిపడా స్నానాలు చేయడానికి నీటి సౌకర్యం లేదని ప్రైవేటుగా వ్యక్తుల వద్దకు వెళ్లి స్నానాలు చేసినట్లయితే రూ. 50 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న కొండగట్టు పుణ్యక్షేత్రం మాత్రం అభివృద్ధి నేర్చుకోలేదన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

ఆలయ అధికారులు సైతం నామమాత్రంగా పనులు చేస్తూ ఉండడంతో ఏదైనా జరగరాని సంఘటన జరిగినట్లయితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా చలవ పందిళ్లు వేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. ఇప్పటికే పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు గురువారం హనుమాన్ జయంతి కావడంతో దీక్ష విరమణ చేసి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఏది ఏమైనా ప్రతి ఏటా దేవదాయ శాఖ సిబ్బంది కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు భక్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆంజనేయ స్వామి భక్తుడని అతను కూడా ఇప్పటికే తన సొంత నిధులు ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించాడని ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :