ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఇష్టదైవమైన ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పుణ్యక్షేత్రానికి హనుమాన్ జయంతి గురువారం జరగనున్న నేపథ్యంలో దీక్షలో ఉన్న లక్షలాది మంది భక్తులు గత ఐదు రోజుల నుండి కాలినడకన పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీక్ష విరమించడానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన చలవ పందులు ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు ఆగ్రహావేశాలకు గురై అధికారులను నిలదీశారు. వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన భక్తులు కాస్త సేద తీరిన తర్వాత వారి మాల విరమణ చేసి స్వామి వారిని దర్శించుకొని వారి మొక్కులు అప్పజెప్తారు. అలాంటి వారికి దేవదాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వారి యొక్క పనులను చేయడంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయ అధికారులను ఎండ కడుతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని మొత్తం సిబ్బందితో పాటు పూజారులే మింగేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చిన భక్తులకు సరిపడా స్నానాలు చేయడానికి నీటి సౌకర్యం లేదని ప్రైవేటుగా వ్యక్తుల వద్దకు వెళ్లి స్నానాలు చేసినట్లయితే రూ. 50 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న కొండగట్టు పుణ్యక్షేత్రం మాత్రం అభివృద్ధి నేర్చుకోలేదన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.
ఆలయ అధికారులు సైతం నామమాత్రంగా పనులు చేస్తూ ఉండడంతో ఏదైనా జరగరాని సంఘటన జరిగినట్లయితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా చలవ పందిళ్లు వేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. ఇప్పటికే పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు గురువారం హనుమాన్ జయంతి కావడంతో దీక్ష విరమణ చేసి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఏది ఏమైనా ప్రతి ఏటా దేవదాయ శాఖ సిబ్బంది కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు భక్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆంజనేయ స్వామి భక్తుడని అతను కూడా ఇప్పటికే తన సొంత నిధులు ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించాడని ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
Admin
E Nivas News