Wednesday, 17 June 2026 01:34:26 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు...

దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కూలిన చలువ పందిళ్ళు..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు..

Date : 01 April 2026 11:04 PM Views : 231

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఇష్టదైవమైన ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పుణ్యక్షేత్రానికి హనుమాన్ జయంతి గురువారం జరగనున్న నేపథ్యంలో దీక్షలో ఉన్న లక్షలాది మంది భక్తులు గత ఐదు రోజుల నుండి కాలినడకన పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీక్ష విరమించడానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన చలవ పందులు ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు ఆగ్రహావేశాలకు గురై అధికారులను నిలదీశారు. వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన భక్తులు కాస్త సేద తీరిన తర్వాత వారి మాల విరమణ చేసి స్వామి వారిని దర్శించుకొని వారి మొక్కులు అప్పజెప్తారు. అలాంటి వారికి దేవదాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వారి యొక్క పనులను చేయడంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయ అధికారులను ఎండ కడుతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని మొత్తం సిబ్బందితో పాటు పూజారులే మింగేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చిన భక్తులకు సరిపడా స్నానాలు చేయడానికి నీటి సౌకర్యం లేదని ప్రైవేటుగా వ్యక్తుల వద్దకు వెళ్లి స్నానాలు చేసినట్లయితే రూ. 50 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న కొండగట్టు పుణ్యక్షేత్రం మాత్రం అభివృద్ధి నేర్చుకోలేదన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

ఆలయ అధికారులు సైతం నామమాత్రంగా పనులు చేస్తూ ఉండడంతో ఏదైనా జరగరాని సంఘటన జరిగినట్లయితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా చలవ పందిళ్లు వేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. ఇప్పటికే పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు గురువారం హనుమాన్ జయంతి కావడంతో దీక్ష విరమణ చేసి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఏది ఏమైనా ప్రతి ఏటా దేవదాయ శాఖ సిబ్బంది కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు భక్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆంజనేయ స్వామి భక్తుడని అతను కూడా ఇప్పటికే తన సొంత నిధులు ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించాడని ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :