ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 10న మహారాష్ట్ర నాగపూర్ లో నిర్వహించిన సైకిల్ ఫోలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బండ జీవరత్నం ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ సైకిల్ పోలో హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బండ జీవరత్నం కొనసాగుతున్నారు. పెద్ద బాధ్యత వహిస్తున్న ఆయన సేవలనుగుర్తించి సైకిల్ పోలో ఫెడరేషన్ ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎ న్నుకోవడం పట్ల పలు జిల్లాల క్రీడా సంఘాలు అధ్యక్ష,, ప్రధాన కార్యదర్శులు అభినందించారు. మరియు మంచిర్యాలఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి తో పాటు సైకిల్ పోలో సీనియర్ క్రీడాకారులు నాలుగు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు. తెలంగాణ సైకిల్ పోలో సెక్రెటరీ ఆర్. సత్యనారాయణ జీవరత్నమును అభినందించారు. తెలంగాణ ట్రెజరర్ సైకిల్ పోలో వి జగదీశ్వర్ అలాగే సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు అద్దంకి బాలశౌరి, చందు,తరాల విజయ్ కుమార్, తరాల అజయ్ కుమార్, జాడిపాల్ ప్రశాంత్ సుమన్ చక్రవర్తి, పూలి సుజిత,పాల్సన్,,కె ప్రశాంత్ లు జీవరత్నం ఎంపిక కావడం పట్ల హర్షణ వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.
Admin
E Nivas News