Thursday, 30 July 2026 05:48:29 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

డివిజన్ కార్యదర్శి సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ సునకారి రాజేష్

Date : 09 November 2025 07:58 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి సునకారి రాజేష్ కోరారు. ఆదివారంనిర్మల్ జిల్లా కడెం మండలం లోని మిద్దె చింత గ్రామంలో భూమి బుక్తి భారతదేశ విముక్తి కోసం విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునరికారి రాజేష్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం, విప్లవోద్యమంలో ప్రజల కోసం పోరాటం చేసి తమ ప్రాణాలు అర్పించారు.చనిపోయిన అమరవీరుల ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ ప్రాంతంలో భూస్వాముల చేతిలో హత్య గురైన కామ్రేడ్ గట్ల గంగన్న, పోరాటంలో చనిపోయిన ఆకుల సత్తన్న మానుక దేవన్న తదితరులు ఎందరో అమరులైనారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ పేరుతోటి బూటకపు ఎన్కౌంటర్లు చేసి అడవిలో ఉన్న ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తు లు ఆదాని అంబానీలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. జీవించే హక్కు కాలరాస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు అర్బన్ నక్సలైట్లు అంటూ తీవ్రంగా అణచివేస్తుందన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలను అమలు చేస్తుందని అంబానీ అదాని లకు గులంగిరి చేస్తూ కోట్లాది రూపాయల దేశ సంపదను కుల్లగొట్టుకపోవడానికి గేట్లు తెరిచింది. ఆదివాసి, గిరిజనులు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను టైగర్ జోన్ పేరుతో లాక్కునే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. ప్రజల సమస్యలు గాలికి వదిలి కులమతాలతో పాలన కొనసాగిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం లింగన్న, అధ్యక్షులు ఆత్రం మాణిక్ రావు, సోయం బలవంతురావ్, దుందిరావ్, ఆత్రం గేదం మోహన్ రావు, చందు, మార్సుకోల మోతిరామ్, భీమ్రావు లింగు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :