ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇందిరమ్మ లబ్ధిదారులను రాష్ట్ర ద్వారా ఎంపిక చేసి డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 01వ డివిజన్ రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో హౌసింగ్ ఎండి అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల పైన, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో అప్పుడు ఉన్న ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. కానీ ఆ ఇండ్లకు మంచి నీళ్లు, రోడ్డులు, ఏమి సౌకర్యాలు లేవని మంత్రి కి స్పష్టంగా తెలియజేశానన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. హౌసింగ్, రెవెన్యూ , మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించడం జరిగిందని, మూడు నెలల తరువాత లక్కీ డ్రా సిస్టంతో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే మాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ , మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News