ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రిటైర్డ్ సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచడమే తన లక్ష్యమని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వివేక్ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో సీఎం పిఎఫ్ కమిషనర్ మరియు కోల్ కంట్రోలర్ సజీష్ కుమార్ ఎన్. ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘కోల్ మైన్స్ పెన్షన్ పథకం 1998’ కింద పదవీ విరమణ చేసిన సింగరేణి బొగ్గు కార్మికుల పెన్షన్ సమస్యలపై కీలకంగా చర్చ జరిగింది. ప్రస్తుతం సింగరేణి నుంచి రిటైర్ అయిన కార్మికులకు వస్తున్న పెన్షన్ చాలా తక్కువగా ఉండటంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కష్టపడి జీవితాంతం పని చేసిన కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే వారి పెన్షన్లు తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందని ఎంపీ వంశీ కృష్ణ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, ప్రస్తుత నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Admin
E Nivas News