Wednesday, 17 June 2026 02:12:23 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు

Date : 10 February 2026 09:20 PM Views : 142

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కేంద్రంలోని ఓల్డ్ సిటీ 27వ వార్డు మిర్యాలగూడ రోడ్డు 22 వార్డ్,గొల్లగూడ 20 వార్డులో గల పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతాపరంగా పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూపోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుంపులపై నిరంతరం నిఘా ఉంచాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లను సక్రమంగా నిర్వహిస్తూ, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సౌకర్యమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం లోపల మరియు బయట తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణనిర్వహించడం, వాహనాల రాకపోకలను నియంత్రించడం, అనవసర వ్యక్తుల ప్రవేశాన్ని కట్టడి చేయడం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఎస్బి సీఐ రాము, టుటౌన్ సీఐ రాఘవ రావు, నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐలు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: