Thursday, 30 July 2026 12:26:28 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్...

Date : 28 February 2026 10:13 PM Views : 139

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, యువత దూరదర్శిని, సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి మైదానం వైపు రావాలని మంత్రి వివేక్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ప్రతాపసింగారంలో ఏర్పాటు చేసిన స్పాట్‌లైట్ క్రికెట్ మైదానాన్ని రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి జీ. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతాపసింగారంలో అద్భుతమైన క్రికెట్ మైదానం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. గత 20 ఏళ్లుగా నర్సింహారెడ్డి క్రికెట్‌కు సేవలందిస్తున్నారని, ఆయన కుమారుడు రంజిత్ మంచి క్రీడాకారుడిగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. రిబ్బన్ కట్ చేసి మైదానాన్ని ప్రారంభించిన అనంతరం బెలూన్లను గాల్లోకి వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. దూరదర్శిని, సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి యువత మైదానం వైపు రావాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. అందరూ కలిసి ఆస్వాదించే ఆట క్రికెట్ అని, ఈ ఆటకు దేశవ్యాప్తంగా అపార ఆదరణ ఉందన్నారు. తాను హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నగర పరిసర ప్రాంతాల్లో క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నానని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇటీవల కాక వెంకటస్వామి గారి పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించిన విషయాన్నిగుర్తుచేశారు. క్రికెట్‌లో ప్రస్తుతం అనేక మార్పులు జరుగుతున్నాయని, అందుబాటులో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 15 శాతం కంటే ఎక్కువ క్రికెట్ ప్రవేశ పత్రాలు ఇవ్వరాదని ప్రస్తావించారు.తాను నివసించేమొయినాబాద్ ప్రాంతంలో కూడా క్రికెట్ మైదానం ఏర్పాటు చేశానని, అక్కడ యువత నుంచి మంచి స్పందనలభిస్తోందన్నారు. ఉస్మానియా వైద్య కళాశాల రోజుల్లో స్కూటర్‌పై వెళ్లి క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి శిక్షకులు అందుబాటులోకి వస్తే మరింత ప్రతిభ వెలుగులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. * ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన* మంత్రి ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను సందర్శించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను పరిశీలించి, వారు ప్రదర్శించిన నమూనాలు మరియు ప్రయోగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను అభినందిస్తూ విజ్ఞానంతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :