ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా నియమితులైన అనిల్ కుమార్ను ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తో కలిసి ఘనంగాసన్మానించి,మిఠాయిలు తినిపించారు. గురువారం శ్యాం నాయక్కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనిల్ కుమార్కు శ్యామ్ నాయక్ శాలువా కప్పి శుభాకాంక్షలుతెలియజేశారు.ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలుతెలుపుతూ, జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి, పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ,డైరెక్టర్ మారుతి పటేల్,మాజీ ఎంపీటీసీ తిరుపతి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏం. డీ.నిజాం,నాంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News