Thursday, 30 July 2026 09:52:26 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

గోదావరిజలంతో నాగోబాకు ఆలయానికి కాలినడకన

గోదావరిలో పూజల తర్వాత జలం తిరుగు పయనం

Date : 07 January 2026 09:52 PM Views : 201

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి హస్తినా మడుగు రేవులో మెస్రంవంశీయులు ప్రత్యేక పూజలు అనంతరం కలశంలో పవిత్ర జలాన్ని తీసుకొని కెస్లాపూర్ నాగోబా జాతరకు బుధవారం మధ్యాహ్నం తిరుగు పయనమయ్యారు. గిరిజనుల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జాతరైన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతర. ఈ జాతర ఈనెల 18న ప్రారంభమై 25న ముగిస్తుంది. గోదావరి జలంతో తిరిగి బయలుదేరిన మెస్రంవంశీయులు ఈనెల 18న కెస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో మహా పూజతో ప్రారంభమై, వారం పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో మెస్రంవంశీయులు ప్రత్యేక పూజలు చేస్తూ ఈనెల 25న నాగోబా జాతర ముగిస్తుంది. మెస్రం వంశీయులలోని పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్, పూజారి(కటోడ) కోసేరావు, తదిత 100 మంది మెస్రంవంశీయుల ఆధ్వర్యంలో కలమడుగు హస్తినమడుగులో ప్రత్యేక పూజలు చేసి నది జలాన్ని కలశంలో తీసుకొని అనంతరం సహాపంక్తి భోజనాలు చేసి కెస్లాపూర్ కు క్యూ లైన్ లో కాలినడకన తిరుగు పయనం అయ్యారు. రాత్రి జైనూరు మండలంలోని పిట్టగూడ కటోడ ఇంట్లో వారంతా రాత్రి భోజనాలు చేసి అక్కడే పడుకుంటారు. మరుసటి రోజు అక్కడి నుండి బయలుదేరి ఈ నెల 14న ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రదేవి వద్దకు చేరుకొని, బసచేసి ఆ తర్వాత వారంతా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని గిరిజనులు కూడా హాజరై, ఎంతో ఆరాధ్యంగా జాతరను జరుపుకుంటారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: