ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా పరిశోధన ఆవిష్కరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సూచన ప్రకారం జిజ్ఞాస విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిజ్ఞాస వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కళాశాల నుండి గత అయిదు సంవత్సరాల్లో చేసిన జిజ్ఞాస పరిశోధనల ప్రాజెక్టులను వాటికి సంబంధించిన చిత్రాలనుప్రదర్శనకు ఉంచారు. ఈ కార్ ఆచార్య ప్రణాళిక ను కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ డా సంతోష్ కుమార్ రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. కళాశాల జిజ్ఞాస కోఆర్డినేటర్ డా తన్నీరు సురేష్ అధ్యర్యంలో ఎక్సిబిషన్ ఏర్పాటు చేయగా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. కళాశాలలోజరుగుతున్న జిజ్ఞాస కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భoగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సంతోష్ కుమార్ మాట్లాడుతూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టును 2014 సంవత్సరంలో ప్రారంభించి నట్లు దీని ద్వారా విద్యార్థుల్లో పరిశోధన పైన ఆసక్తిని పెంపొందిoచడo ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రతి సంవత్సరం జిజ్ఞాస ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతున్నాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త డా. తన్నీరు సురేష్ కళాశాల అధ్యాపకులు శంకరయ్య, ప్రేమలత, నాగేశ్వర్, కవిత, సంధ్యారాణి, స్వప్న, రాజ్ కుమార్, మల్లయ్య,నివేదిత, స్వామి, సతీష్, సత్యనారాయణ, మహేష్ కుమార్ లు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News