ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యాభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని నేటి బాలలే రేపటి పౌరులని వారి యొక్క చదువుతోనే వారి జీవితమే అభివృద్ధి చెందుతుందని బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానెరడిగొండ మండలంలోని నారాయణ్ పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 10 లక్షలతో మంజూరు అయిన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యార్థులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు నిర్మాణానికి విద్య అవసరమని, విద్యాభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ పాటు పడతానని అన్నారు. అడగకపోయిన గ్రామానికి 1 కోటి 50 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేయించాం, 40 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు కేసీఆర్ నాణ్యమైన ఉచిత విద్యను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర లక్ష్మీ ఉష, ఉప సర్పంచ్ జాదవ్ అనూష బాయి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నానక్ సింగ్, జాదవ్ గణేష్, నాయకులు అనిల్ యాదవ్, ఎంపిడిఓ, పచు సింగ్, గులాబ్, రాజు, నజీర్, పవన్, అశోక్, రాం, మరియు మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు రమేష్, కృష్ణ, జీవన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News