ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలు పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్, భీంగల్ లోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలు పాదయాత్రగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈసందర్భంగాపోలీసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటిభయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్య తలెత్తిన పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఫ్లాగ్ మార్చిన వలన ఎన్నికలవేళ ప్రజల్లో భద్రతాభావం , నమ్మకం పెరుగుతుందని , పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఫ్లాగ్ మార్చ్ లో ఏసీపీలు, సిఐలు , ఎస్.ఐ లు , క్యూ.ఆర్.టి సిబ్బంది , ఆర్ముడు రిజర్వ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News