Thursday, 30 July 2026 01:47:34 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బీసీ రిజర్వేషన్లు బహుజన్ సమాజ్ పార్టీ తోనే సాధ్యం

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కాదాశి రవీందర్

Date : 27 October 2025 07:12 PM Views : 313

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ రిజర్వేషన్లు సాధించడం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నాయకులు కాదాసీ రవీందర్ స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రం చార్వక ట్రస్ట్ హాలు నందు బీసీ విశాల మహాధర్నా గోడపత్రులు ఆవిష్కరించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కాదాశి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గతంలో 27 శాతం బీసీ రిజర్వేషన్స్ సాధించడంలో బహుజన్ సమాజ్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు, 42 శాతం బీసీ రిజర్వేషన్స్ బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమన్నారు. బీసీ రిజర్వేషన్స్ సాధనకై ఇందిరా పార్క్ వద్ద జరుగు విశాల మహా ధర్నాలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలన్నారు. గోడపత్రుల ఆవిష్కరణలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగాం శ్రీనివాస్, బాంసేపు నాయకులు శెట్టి శంకరయ్య, జిల్లా మహిళా నాయకురాలు శేట్టి ప్రవళిక, మంచిర్యాల జిల్లా నాయకులు మడిపల్లి రాములు, బూడిద మల్లేష్, ఎన్ రెడ్డి తిరుపతి, కుమ్మరి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :