ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు విద్యుత్ తో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సూచించారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినవార్షికోత్సవ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. కళాశాలలోచదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పలు విద్యార్థులు నృత్యం చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహుమతులు అందజేశారు.
కళాశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల విషయంలో తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ముందుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ను శాలువాతో మరియు గజమాలతో సత్కరించారు.
తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, కళాశాల ప్రిన్సిపాల్ లక్మణ్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్పరంచులు, వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రిన్సిపల్ లక్ష్మణరావు కళాశాల సిబ్బంది, విద్యార్థులుపాల్గొన్నారు.
Admin
E Nivas News