Friday, 19 June 2026 01:34:05 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం

Date : 14 January 2026 10:38 PM Views : 184

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల ఫోన్లు లాక్కొని సంక్రాంతి పండుగకు పంపించకుండా గదుల్లో నిర్బంధించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన విద్యార్థినుల స్వేచ్ఛ, భద్రత, మానవ హక్కులపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోఅదీ బాలికల హాస్టళ్లలో ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడం ఆందోళనకరం. పండుగ అనేది కుటుంబాలతో గడిపే సమయం కాబట్టి అలాంటి వేళ, సరైన ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం, నిర్బంధం వంటి పరిస్థితులు సృష్టించడం నైతికంగా, పరిపాలనపరంగా సమర్థనీయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి దృష్టికి వెళ్లగానే ఆమె వెంటనే స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి, హిందూ విద్యార్థినులను తక్షణమే వారి సొంతింటికి పంపించాలని కోరినట్లు సమాచారం. దీనిపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థినులపై పాలకులుగా కాకుండా, సంరక్షకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత హాస్టల్ నిర్వాహకులది. నియమాలు ఉంటే అవి స్పష్టంగా, సమానంగా, మానవీయంగా అమలవ్వాలి. మతం, లింగం, నేపథ్యం అనే తేడాలు లేకుండా విద్యార్థినులందరికీ సమాన హక్కులు కల్పించాల్సిందేనని, ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ పరిపాలనపై పర్యవేక్షణ పెంచడం, ఫిర్యాదు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే పండుగ వేళ విద్యార్థినుల కన్నీళ్లు కాకుండా, వారి ముఖాల్లో ఆనందమే కనిపించాలని, ప్రభుత్వం తీసుకునే చర్యలే రేపటి ప్రమాణాలకు అద్దం పడతాయి అనడంలో సందేహంలేదనే సర్వత్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: