ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2026 ద్వారా 2026 - 27 విద్యా సంవత్సరానికి గాను, 5వ, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు (బ్యాక్లాగ్ వేకెన్సీస్) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు మంచిర్యాల జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డి సి ఓ శ్రీమతి కోటూరి రమ కళ్యాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష లో వచ్చిన మెరిట్ ఆధారంగా, తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసి వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించబడతాయని తెలిపారు. ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష వచ్చే సంవత్సరం అనగా 2026 ఫిబ్రవరి 22 ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన బాలబాలికలు 21, జనవరి, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాములు, క్రీడా సామాగ్రితో పాటు ఐఐటి, నీట్, సియుఈటి వంటి జాతీయస్థాయి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని డిసిఓ రామ కళ్యాణి తెలిపారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో స్వీకరించ బడతాయని అర్హత కలిగిన బాల బాలికల తల్లిదండ్రులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలు మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారము ఇవ్వబడతాయని తెలిపారు. అర్హత కలిగిన బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిఓ కోరారు.
Admin
E Nivas News