ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నీ ఐటీఐ, (ఎ టి సి) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం మహనీయుల జయంతి ఉత్సవాల పేరుతో విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్పోటీలునిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ వై. రమేష్ పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వై. రమేష్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రలపై అవగాహన కల్పించారు. అనంతరం తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే మొట్ట మొదటిసారి తన భార్య సావిత్రి భాయి పులే కి విద్య నేర్పించి ఆ తర్వాత స్త్రీలకు విద్యానందించారు.అంటరానితనం, అస్పృశ్యత పై పోరాటం చేసిన మహానుభావులు అని కొనియాడారు. అదే విధంగా డా" బి.ఆర్.అంబేద్కర్ మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు ప్రవేశ పెట్టి పార్లమెంట్ లో బిల్లు అమలు కాకపోవడం తో తన మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఓటు హక్కు కల్పించిన గొప్ప మహనీయుడుఅన్నారు. ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, వేముల కిరణ్, ఐటీఐ టీచర్స్ రాజు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News