Thursday, 02 April 2026 01:52:06 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

ప్రభుత్వం నుండి విడుదలైన వేతనాలు ఇప్పించాలని వినతి పత్రం అందజేత

Date : 30 December 2025 03:58 PM Views : 118

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాత శిశు హాస్పటల్లో సానిటేషన్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన అక్టోబర్ నెల వేతనాలు ఇప్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో హాస్పటల్ సూపరిండెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని ఆస్పటల్, మాత శిశు కేంద్రంలో పనిచేస్తున్న సానిటేషన్ ఉద్యోగ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలు విడుదల చేసిందన్నారు. అందులో అక్టోబర్ నెల వేతనాలు కూడా ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన అక్టోబర్ నెల వేతనాలు కార్మికులకు ఇవ్వాలని, అదే విధంగా ప్రతి కార్మికునికి పిఎఫ్ సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఉద్యోగ కార్మికులు భారత్, రమాదేవి, లలిత, రాజబాబు, సిఐటియు నాయకులు బాబు రవి తదితరు లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :