ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో జరుగు ఈనెల 14, 15, 16 తేదీల్లో మహా శివరాత్రి జాతర సందర్భంగా జాతరకు వివిధ జిల్లాల నుంచి బందో బస్సుకు వచ్చిన పోలీసు అధికారులకు సిబ్బందికి శుక్రవారం వేములవాడ పట్టణ పరిధిలోని మహారాజా ఫంక్షన్ హాల్ లో విధుల నిర్వహణపై ఎస్పీ మహేష్ బి.గితే దిశా నిర్దేశం చేశారు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామి వారిని దర్శించుకునేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. దేవస్థానం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్ పాటించేలా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం నిఘా పోలీస్ నిఘా ఉంచాలని,ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూంకు తెలియజేయాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఓపికతో సలహాలు , సూచనలు ఇస్తూ జాతరకు వచ్చే భక్తుల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని, ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో విధులు నిర్వహిస్తూ జాతర విజయవంతం చేయాలన్నారు. భక్తజన సందోహం ఉన్నచోట దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఇతరనేరాలు జరుగకుండా అరికట్టేందుకు క్రైమ్ పార్టీలు నిరంతరం నిఘాఉంచాలన్నారు.జాతరలో మహిళా రక్షణార్ధం షీ టీం బృందాలు కూడా సివిల్ డ్రెస్ లలో విధుల్లో ఉంటారనిపేర్కొన్నారు.ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడితే అధికారులకు తెలియజేయాలన్నారు. పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున జాతరకు భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని,ట్రాఫిక్ ,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ జామ్ అవకుండా నియంత్రణ చేయాలన్నారు.జాతరకు వచ్చేవాహనాల ద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పట్టణంలో రూట్ మ్యాప్ లు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా స్టాపర్స్, కోన్స్, స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎస్పీవెంట ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్ లు,ఎస్.ఐ లు ,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News