Wednesday, 17 June 2026 01:47:40 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

Date : 18 March 2026 07:30 AM Views : 489

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ రజిత దంపతులు మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి... శ్రీనివాస్ అతని తమ్ముని గృహప్రవేశం హైదరాబాదులో సోమవారం ఉండగా భార్య కూతురుతో కలిసి శుభకార్యానికి కారులోవెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీనివాస్ కూతురు కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో మెడిసిన్3 వ సంవత్సరం చదువుతుంది. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో తన కూతురిని ప్రతిమ కళాశాల వద్ద దించి వస్తుండగా పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుగ్గ గుట్ట రాజీవ్ రహదారి కల్వర్టు వద్ద ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భార్యాభర్తల మృతదేహాలను పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడ్ల శ్రీనివాస్ పేదరికం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారరంగంలో అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల తోపాటు కూతురి రోదన పలువురిని కంఠతడి పెట్టించింది. ఏది ఏమైనా భార్యాభర్తలు మంచిర్యాల జిల్లా లో దుర్మరణం చెందడం ఇది రెండవ సంఘటన. గత నెలలో లక్షెట్టిపేటకు చెందిన జనరల్ స్టోర్ వ్యాపారి సత్యనారాయణ దంపతులకు కూడా శబరిమల దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన విషయం తెలిసిందే..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: