ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ రజిత దంపతులు మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి... శ్రీనివాస్ అతని తమ్ముని గృహప్రవేశం హైదరాబాదులో సోమవారం ఉండగా భార్య కూతురుతో కలిసి శుభకార్యానికి కారులోవెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీనివాస్ కూతురు కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో మెడిసిన్3 వ సంవత్సరం చదువుతుంది. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో తన కూతురిని ప్రతిమ కళాశాల వద్ద దించి వస్తుండగా పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుగ్గ గుట్ట రాజీవ్ రహదారి కల్వర్టు వద్ద ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భార్యాభర్తల మృతదేహాలను పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడ్ల శ్రీనివాస్ పేదరికం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారరంగంలో అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల తోపాటు కూతురి రోదన పలువురిని కంఠతడి పెట్టించింది. ఏది ఏమైనా భార్యాభర్తలు మంచిర్యాల జిల్లా లో దుర్మరణం చెందడం ఇది రెండవ సంఘటన. గత నెలలో లక్షెట్టిపేటకు చెందిన జనరల్ స్టోర్ వ్యాపారి సత్యనారాయణ దంపతులకు కూడా శబరిమల దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన విషయం తెలిసిందే..
Admin
E Nivas News