ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో క కుల మతాలకతీతంగా జరుపుకోవాలని సిఐ రమణమూర్తి తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో హిందూ, ముస్లిం పెద్దలతో శాంతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పండుగ సందర్భంగా పరస్పర సహకారం, సామరస్య వాతావరణం కొనసాగించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. మత పెద్దలు కూడా పోలీసుల సూచనలను పాటిస్తూ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎస్సై గోపతి సురేష్ హిందూ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
Admin
E Nivas News