ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, సతీమణి డాక్టర్ జాటోత్ ప్రమీల, 5వ ,8వ,9వ ,13వ 14వ వార్డులలో విస్తృతంగా గడప గడప కు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరిపెడ మున్సిపాలిటీలో ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు, ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమం, అభివృద్ధిని సమన్వయంగా ముందుకు తీసుకెళ్తాందని తెలిపారు. మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పేదలకు పథకాలు అభ్యర్థి ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, స్నేహా యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి,కొంపల్లి శ్రీనువాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద బోయిన ఐలమల్లు, పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, షేక్ అఫ్జల్, గుండాగాని వేణు, యుత్ మండల అధ్యక్షులు బానోతు నరేష్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, గుండగాని వెంకన్న, కారంపొడి ఉపేందర్, మహేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News