Wednesday, 17 June 2026 02:07:31 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతి

Date : 23 November 2025 08:25 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను బీసీ, ఎస్సీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం లక్షెట్టిపేటలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుంచు లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య 1979-1983 లక్షెట్టిపేట నియోజకవర్గం లోని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని,ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బిసి బడుగు బలహీన వర్గాల అండదండలతో గెలిచిన లక్ష్మయ్య సేవలు ఇప్పటికి ప్రజలు మరిచిపోరన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాటలను తుంగలతో అక్కాయని 65 శాతం మంది బీసీ వర్గాల ప్రజలు ఉన్నారు అన్న విషయం వారికి తెలువదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీ సంఘాల నాయకులు అంతా ఏకతాటిపై వచ్చినట్లయితే తప్పకుండా స్వతంత్రంగానే పోటీ చేసి మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవవచ్చునన్నారు. బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆలోచనలను బీసీ వర్గాల్లో తీసుకెళ్లి ముందుకు నడపాలని కోరారు. వచ్చే జయంతి నాటికి తప్పకుండా లక్షెట్టిపేటలో చుంచు లక్ష్మయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా నాయకులు కర్రె లచ్చన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మల్లేష్, బిసీ జిల్లా నాయకులు తుల మధుసూదన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, మాజీ చుంచు చిన్నయ్య, మాజీ సర్పంచ్ దుమ్మని లచ్చయ్య బిసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: