ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను బీసీ, ఎస్సీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం లక్షెట్టిపేటలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుంచు లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య 1979-1983 లక్షెట్టిపేట నియోజకవర్గం లోని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని,ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బిసి బడుగు బలహీన వర్గాల అండదండలతో గెలిచిన లక్ష్మయ్య సేవలు ఇప్పటికి ప్రజలు మరిచిపోరన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాటలను తుంగలతో అక్కాయని 65 శాతం మంది బీసీ వర్గాల ప్రజలు ఉన్నారు అన్న విషయం వారికి తెలువదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీ సంఘాల నాయకులు అంతా ఏకతాటిపై వచ్చినట్లయితే తప్పకుండా స్వతంత్రంగానే పోటీ చేసి మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవవచ్చునన్నారు. బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆలోచనలను బీసీ వర్గాల్లో తీసుకెళ్లి ముందుకు నడపాలని కోరారు. వచ్చే జయంతి నాటికి తప్పకుండా లక్షెట్టిపేటలో చుంచు లక్ష్మయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా నాయకులు కర్రె లచ్చన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మల్లేష్, బిసీ జిల్లా నాయకులు తుల మధుసూదన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, మాజీ చుంచు చిన్నయ్య, మాజీ సర్పంచ్ దుమ్మని లచ్చయ్య బిసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News