ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలకేంద్రంలో ఈ నెల 28న మంత్రి రాజయ్య అనే హమాలీ కార్మి కుడి స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలు పరిశీంచగా బైకును ఎత్తుకెళ్లిన సదరు దుండగుడు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తో మాట్లాడినట్లు గుర్తించారు. సదరు వ్యక్తిని ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్లిన వ్యక్తి విషయంపై ప్రశ్నించగా మహారాష్ట్ర లోని వడిదేం గ్రామ వాస్తవ్యుడు ఏరికిచెటల రాజమల్లుపోచం అని తెలుపగా దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి బైక్తో పాటు సదరు నిందితుడిని పట్టుకుని వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపు తున్నట్లు స్థానిక ఎస్సై ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Admin
E Nivas News