ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఆరాధ్య దైవమైన కొండగట్టు అంజన్న జయంతిని పురస్కరించుకొని గురువారం కొండగట్టు జనసంద్రంగా మారింది. తెలంగాణనుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి హనుమాన్ దీక్షపరు లు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ భక్తులతో క్రిరిసిపోయాయి. బుధవారం సాయంత్రం నుండి పాదయాత్ర తో పాటు తదితర వాహనాల్లో భారీగా భక్తులు తరగలరావడంతో దీక్షపరులకు సరిగా వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మాల విరమణ చేసే ప్రాంగణాల్లో సైతం ఒకేసారి చాలామంది దీక్ష పరులను కూర్చుండబెట్టి మాల విరమణ చేయడంతో అక్కడ కూడా గందరగోళం నెలకొంది. అ ధీక్ష పరుల వద్ద పురోహితులు మాల విరమణ చేసే సమయంలో అధికంగా డబ్బులు వసూలు చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకు స్నానాలకు కోనేరులో నీరు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోట్ల అధిరూపాయల ఆదాయం అంజన్న క్షేత్రానికి వస్తున్న ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొండగట్టుకు వచ్చి అంజన్నకు ముక్కులు సమర్పించి వెళ్తున్నారు తప్ప ఆలయ అభివృద్ధి కొరకు ఏమాత్రం ఆలోచించడం లేదని పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చాలామంది చిన్న పిల్లలు కూడా దీక్ష తీసుకొని వాళ్ల మీద మాల విరమణ కోసం రావడంతో సందడి నెలకొంది. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వారి యొక్క పుత్రులకు ఆంజనేయస్వామి వేషం వేయడంతో చూపరులను ఆకట్టుకున్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.
Admin
E Nivas News