Saturday, 13 June 2026 04:23:38 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకట్టుకున్నరంగవల్లి పోటీలు...

Date : 09 January 2026 09:20 PM Views : 232

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో సృజనాత్మకతను, సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో రంగవల్లి పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించారు. రంగుల సమ్మేళనం, రూపకల్పన, సంప్రదాయ శైలిని ప్రతిబింబించే రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ కె. లక్ష్మణ్ రావు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ బి. అశోక్ గౌడ్ సమన్వయంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. విద్యార్థుల్లో పోటీస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఫోటో పోటీగా రంగవల్లులు వేశారు. పోటీలలో ప్రతిభ కనబరిచినవిద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేశారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లక్షెట్టిపేట ఎంపీడీవో సరోజ, ఎంఈఓ శైలజ, హైస్కూల్ పిడి ఇందిర, లైబ్రేరియన్ కళావతి, విజయ్ పాల్గొని జడ్జిలుగా వ్యవహరించారు. వారు విద్యార్థుల ప్రతిభను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు చిన్నయ్య, అరవింద్, హేమా చందర్, మహేష్, రామ్ ప్రసాద్, మహేందర్, బాలాజీ, శ్రీనివాస్ రావు, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :