ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చిరుతపులి ని వేటాడి చంపిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్ళపేట అటభిక్షేత్రాధికారిని సుష్మరావు సోమవారం తెలిపారు.కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బఫర్ ఏరియాలోచిరుతపులిని అక్రమంగా వేటాడిచంపిన దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఊట్ల గ్రామానికి చెందిన ముడితె వెంకటేష్, ముడితె శ్రీనివాస్, పాతమామిడిపల్లి కి చెందిన వనపర్తి శ్రీకాంత్ ను విశ్వసనీయ సమాచారం మేరకు సమాచారంతో అదుపులో తీసుకొని విచారించగా అడవిలో అడవి పందులను పట్టుకునేందుకు క్లచ్ వైర్తో ఉచ్చు పెట్టగా అందులో చిరుతపులి చిక్కుకుని ఊపిరాడక మృతి చెందినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్కు పంపినట్లు ఆమె పేర్కొన్నారు.
Admin
E Nivas News