ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థపై లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బాలుర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ (లక్షెట్టిపేట) వార్డెన్ బాలాసంకుల రాజ్ గోపాల్ రావు కి గత నాలుగు నెలలుగా ప్రభుత్వం నుండి రావాల్సిన 8 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు రాక మరియు ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో వారి నివాసం లో మూడు రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మరియు స్థానిక బీజేపీ నాయకులు వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. బిల్లులు రాక ఆర్ధిక ఇబ్బందులు భరించలేక చివరికి తల్లి గాజులు అమ్మ వలసిన పరిస్థితుల్లో రాజ్ గోపాల్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారనిరఘునాథ్ తెలిపారు . విద్యా శాఖ మంత్రి గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంకూడా దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు . ఏప్రిల్ 2025 నుండి ఇప్పటి వరకు గుడ్ల బిల్లులు చెల్లించ లేదన్నారు. అంతేకాకుండా గత మూడు నెలల మధ్యాహ్న భోజన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా రంగం క్రమంగా కుప్పకూలే దశకు చేరిందన్నారు . ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు దాటినా, ఇప్పటివరకు పాఠశాల నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. ఈ కారణంగా పాఠశాలలలో చాక్ పీసులు, డస్టర్స్, అవసరమైన సామగ్రి కొనుగోలు, చిన్న చిన్న మరమ్మత్తులు, కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయే ప్రధానోపాధ్యాయులు వారి జేబుల నుండి చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాక వార్డెన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అటు రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు జీపీఎఫ్ రాక టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారన్నారు . విద్యా మరియు సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News