Thursday, 30 July 2026 10:39:10 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులుసిలివేరు అనిల్

Date : 01 November 2025 11:21 AM Views : 275

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అనేకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి చూస్తూ ఓర్చుకోలేక కడుపు మంటతో ఎక్కడ వారి మనగడ పోతుందోనని భయంతో రోడ్లపైకి వచ్చి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులపై స్థానిక ఎమ్మెల్యే పై మండల నాయకులపై, అసత్యపు ప్రచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులుసిలివేరు అనిల్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మార్లు బస్సు చార్జీల పెంపు, కరెంటు చార్జీల పెంపు, గ్యాస్ ధరల పెంపుతో పేద ప్రజల మీద అధిక భారం మోపిందని, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని ప్రజలు గమనిస్తున్నారని సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు, 10 లక్షల ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇంతకంటే ఎక్కువ సహాయం ఏ ప్రభుత్వం చేస్తుందో మీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. 20 నెలల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరూపించగలరా. 2014 నుండి 2023 వరకు పదేళ్లలో టిఆర్ఎస్ పాలనలో మేనిఫెస్టోలో పెట్టి ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకివ్వలేదన్నారు. దళిత బంధు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు కేజీ టు పీజీ ఉచిత విద్యలాంటి హామీలను నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజలపై 8 లక్షల కోట్ల భారం మోపి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కెసిఆర్, బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ గురించి మాట్లడటం గమనార్హమన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :