ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అనేకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి చూస్తూ ఓర్చుకోలేక కడుపు మంటతో ఎక్కడ వారి మనగడ పోతుందోనని భయంతో రోడ్లపైకి వచ్చి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులపై స్థానిక ఎమ్మెల్యే పై మండల నాయకులపై, అసత్యపు ప్రచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులుసిలివేరు అనిల్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మార్లు బస్సు చార్జీల పెంపు, కరెంటు చార్జీల పెంపు, గ్యాస్ ధరల పెంపుతో పేద ప్రజల మీద అధిక భారం మోపిందని, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని ప్రజలు గమనిస్తున్నారని సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు, 10 లక్షల ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇంతకంటే ఎక్కువ సహాయం ఏ ప్రభుత్వం చేస్తుందో మీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. 20 నెలల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరూపించగలరా. 2014 నుండి 2023 వరకు పదేళ్లలో టిఆర్ఎస్ పాలనలో మేనిఫెస్టోలో పెట్టి ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకివ్వలేదన్నారు. దళిత బంధు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు కేజీ టు పీజీ ఉచిత విద్యలాంటి హామీలను నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజలపై 8 లక్షల కోట్ల భారం మోపి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కెసిఆర్, బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ గురించి మాట్లడటం గమనార్హమన్నారు.
Admin
E Nivas News