ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ఎన్నికల విధుల శిక్షణ మాస్టర్ ట్రైనర్ల ఎంపి కలో పారదర్శకత పాటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూ-టీఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిర్యాల సతీష్ రెడ్డి, చాగర్లముడి శ్రీధర్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారని, రాబోయే మునిసిపల్, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల శిక్షణ విధుల నుంచి వారిని మినహాయించాలని కోరారు. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లను మాస్టర్ ట్రైనర్లుగా నియమించడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎస్సెస్సీ విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకొని గతంలో 2018-2019 శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలల్లో మాస్టర్ ట్రైనర్లుగా విధులు నిర్వహించిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఒకే ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేయడం వలన ఇతర ప్రాంత ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని మున్సిపల్,యంపిటీసి,జెడ్పీటిసి ఎన్నికలకు, జనగణనకు శిక్షణ కొరకు మాస్టర్ ట్రైనర్ ల ఎంపికలో అన్ని మండలాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, సంఘ బాధ్యులు దోమల లింగన్న, వెంకట్ రెడ్డి, కరుణాకర్, హాల్య, నాగరాజు పాల్గొన్నారు.
Admin
E Nivas News