Wednesday, 08 April 2026 03:08:07 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ

Date : 01 April 2026 10:40 PM Views : 64

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పార్టీలో ఏవైనా, ప్రజల పక్షాన, ప్రజా అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడి బోథ్ నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో మంజూరు అయిన విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. బోథ్ మండలంలోని ధన్నుర్ బి గ్రామంలో, నెరడిగొండ మండలంలోని కుప్టి గ్రామంలో, తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్లు కావాలని పలు మార్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రులను, అధికారులను కలిసి విన్నవించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉట్నూర్ మండలంలోని పెర్కాగుడా గ్రామానికి విచ్చేసినప్పుడు సైతం వినతిపత్రం అందజేయగా ఎట్టకేలకు బోథ్ నియోజకవర్గంలోని బోథ్ మండలంలో ధన్నుర్ బి, నెరడిగొండ మండలంలోని కుప్టి కుమారి, తలమడుగు మండలంలోని కుచులపూర్ లో నూతనంగా 3 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తానని, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన ప్రజా సమస్యలకై అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి వైపే వెళ్తానని తెలిపారు. ఇట్టి సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :