ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తమది చేతల ప్రభుత్వం అని ఒకసారి మాట ఇస్తే దాన్ని కచ్చితంగా నిలబెట్టుకుని తీరుతామని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా జరిగిన కార్యక్రమంలో చైర్మన్ కళాశాల మైదాన అభివృద్ధికి మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ లతో కలిసి కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడం వల్ల ఆటలకు అనుకూలంగా లేదని, మైదానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆటలకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు అవసరమైన నిధులను అంచనా వేయాల్సిందిగా మున్సిపల్ ఏఈ మౌనికను ఆదేశించారు. కొద్దిరోజుల్లోనే మైదానంలో పెరిగిన తుమ్మలు , పిచ్చి మొక్కలను తొలగించి గ్రావెల్ నింపుతామన్నారు. మైదానం అభివృద్ధి చేసిన అనంతరం మళ్లీ తానే వచ్చి ప్రారంభిస్తామన్నారు. చైర్మన్ వెంట కౌన్సిలర్లు పెంటరి రాజు, మారుపాక నిహారిక, జంబోజు సమ్మయ్య తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News