ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతర అనుసరణతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే లైన్ విస్తరణ–అభివృద్ధి పనుల్లో భాగంగా పలు లెవల్ క్రాసింగ్ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఓదెల మండలంలోని పలు గ్రామాలు మరియు పెద్దంపేట ప్రాంతాల్లో ప్రతిపాదిత ఆర్ ఓ బి ల కోసం సోమవారం జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.కాజీపేట–బల్లార్షా సెక్షన్లోని ఎల్ సి .28 & 29 (కి.మీ 315/5-7 & 314/30-32) పొట్కాపల్లి గ్రామం, ఎల్ సి .31 & 32 ఓడల గ్రామం, ఎల్ సి .34 కొలనూర్ గ్రామం (అన్నీ ఓదెల మండలం) అలాగే ఎల్ సి .52 పెద్దంపేట గ్రామం పరిధిలో అధికారుల బృందం స్థల పరిశీలన చేసింది. ప్రతిపాదిత అలైన్మెంట్పై గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు, రైతులకు వివరాలు తెలియజేసి, ప్రజల సూచనలు స్వీకరించారు. ఇన్స్పెక్షన్లో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సమ్రాట్ రాయ్, రైల్వే భూ సేకరణ నిపుణులు పి. దేవరాజు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గంగయ్య, ఓదెల తహసీల్దార్ ధీరజ్, సుల్తానాబాద్ మరియు రామగుండం తహసీల్దార్లు, ఆర్ అండ్ బి పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, రైతులు, పంచాయతీ కార్యదర్శులుపాల్గొన్నారు.ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా, ప్రమాదాలు నివారించే దిశగా ROBలు కీలకంగా ఉపయోగపడతాయని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తికాగానే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌలభ్యం గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Admin
E Nivas News