Friday, 19 June 2026 01:28:37 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

దొంగతనం కేసులో భార్యాభర్తల అరెస్ట్

బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం డిఎస్పి రఘు చందర్

Date : 06 February 2026 09:14 PM Views : 186

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 3న అర్ధరాత్రి సమయంలో ఆలయ తాళం పగలగొట్టి దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు మరియు హుండీలోని నగదును దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.4,357/- నగదుతో పాటు దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై ఆలయ పూజారి సముద్రాల జగన్మోహన్ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్64/2026 కింద 331(4), 305(a) బి.ఎన్.ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సై ఎం. సుప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి6 న కరీంనగర్ రోడ్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, పంచల సమక్షంలో వారిని విచారించారు. విచారణలో వారు ఆలయంలో జరిగిన దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: