ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమయం ఉన్నప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగడ్డం వంశీకృష్ణ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఉదయం హైటెక్ సిటీలోని బ్యాడ్మింటన్ కోర్టులో యువతతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి క్రీడల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్ను సందర్శించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులతో క్రికెట్ ఆడారు. మైదానం అభివృద్ధికి అవసరమైన చర్యలపై వెంటనే స్పందించిన ఎంపీ శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి గ్రౌండ్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా 20 ట్రిప్పుల మట్టిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారుల క్రీడా ప్రోత్సాహం కోసం రెండు క్రికెట్ కిట్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనిఆకాంక్షించారు. అనంతరంమార్కెట్ ప్రాంతంలోని రతన్ లాల్ హోటల్ వద్ద స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీటి వంటి సమస్యలను ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా హోటల్ యజమానులు, వ్యాపారులతో మాట్లాడి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సరఫరా సక్రమంగాజరుగుతుందా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీమాట్లాడుతూప్రజల సమస్యలే నా సమస్యలు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం నా బాధ్యత” అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News