ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మావోయిస్టులు అజ్ఞాతవాన్ని వీడి ప్రజాసేత్రంలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం తెలంగాణ సీఎం.రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులులొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని అతడికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా భద్రతఅన్ని రకాల సేవలుఅందిస్తామన్నారు. చరిత్రలో ఇదే ఇంత పెద్ద లొంగుబాటనే తెలిపారు. మావోయిస్టులు లొంగుబాటుకుకృషిచేసిన అధికారులను ప్రశంసించారు. తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మావోయిస్టులు ఆయుధాలు అప్పజెప్పారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడం వల్ల లాభం లేదని సమాజంలో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మావోయిస్టుల్లో కూడా మంచి విద్యావంతులు ఉన్నారని వారికి రాజకీయాల్లోకి రావాలని కోరిక ఉంటే ఆహ్వానిస్తున్నామన్నారు. మీరు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. లొంగిపోయిన వారందరికీపునరావాసం కల్పిస్తామని అలాగే ఇంకా మావోయిస్టులు అందరు కూడా వచ్చి లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది ఉన్నారు. 124 తుపాకులను పోలీసులకుఅప్పగించిన లొంగిపోయిన మావోయిస్టులు...
ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులనుపోలీసులకు అప్పగించి మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు మొత్తం లొంగి పోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇంకా కేవలం ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిజిపి శివధర్ రెడ్డి డిఐజి సుమతిలను అభినందించారు. అనంతరం డిజిపి శివధర్ రెడ్డి మావోయిస్టులకు వారి పేరిట ఉన్న చెక్కులను పంపిణీ చేశారు.
Admin
E Nivas News