Wednesday, 17 June 2026 01:48:23 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

మావోయిస్టులు ప్రజా క్షేత్రంలో కలవండి..!మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తాం...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 08 March 2026 01:03 AM Views : 169

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మావోయిస్టులు అజ్ఞాతవాన్ని వీడి ప్రజాసేత్రంలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం తెలంగాణ సీఎం.రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులులొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని అతడికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా భద్రతఅన్ని రకాల సేవలుఅందిస్తామన్నారు. చరిత్రలో ఇదే ఇంత పెద్ద లొంగుబాటనే తెలిపారు. మావోయిస్టులు లొంగుబాటుకుకృషిచేసిన అధికారులను ప్రశంసించారు. తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మావోయిస్టులు ఆయుధాలు అప్పజెప్పారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడం వల్ల లాభం లేదని సమాజంలో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మావోయిస్టుల్లో కూడా మంచి విద్యావంతులు ఉన్నారని వారికి రాజకీయాల్లోకి రావాలని కోరిక ఉంటే ఆహ్వానిస్తున్నామన్నారు. మీరు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. లొంగిపోయిన వారందరికీపునరావాసం కల్పిస్తామని అలాగే ఇంకా మావోయిస్టులు అందరు కూడా వచ్చి లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది ఉన్నారు. 124 తుపాకులను పోలీసులకుఅప్పగించిన లొంగిపోయిన మావోయిస్టులు...

ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులనుపోలీసులకు అప్పగించి మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు మొత్తం లొంగి పోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇంకా కేవలం ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిజిపి శివధర్ రెడ్డి డిఐజి సుమతిలను అభినందించారు. అనంతరం డిజిపి శివధర్ రెడ్డి మావోయిస్టులకు వారి పేరిట ఉన్న చెక్కులను పంపిణీ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :